CK Nayudu Cup Triple Century: క్రికెట్ హిస్టరీలో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీ రికార్డులు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. ఒకప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు తమ సత్తా చాటగా.. ఇప్పుడు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి బ్యాటర్స్ తుఫాను బ్యాటింగ్తో బౌలర్లను భయపెడుతున్నారు. అయితే, దేశవాళీ క్రికెట్లోనూ కొత్తగా ఎంతోమంది సత్తా చాటుతూ భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు.