
ఈ బ్యూటీ అందం, అభినయంతో వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్.. ముందు ఓ డాక్టర్. డాక్టర్ చదువుతూ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మలు మన సినీ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. సాయి పల్లవి, ఐశ్వర్య లక్ష్మి, శ్రీలీల వంటివారు ఈ కోవలోకి వస్తారు. ఈ తెలుగు అమ్మాయి కూడా అంతే. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా. ? తనే తెలుగమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల.
అచ్చ తెలుగు అమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ చేసి.. అపోలో ఆసుపత్రిలో కొన్నాళ్లు డాక్టర్ గా పనిచేసింది. 2018లో మిస్ తెలంగాణగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో ఆఫర్లు అందిపుచ్చుకుంది. ప్రియురాలు అనే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆపై మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ.. విభిన్న క్యారెక్టర్ల చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మా ఊరి పొలిమేర, పొలిమేర 2 మూవీస్ ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. అలాగే ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ కూడా చేసింది ఈ అందాల భామ. ఈ అమ్మడు ఎక్కువగా డీగ్లామర్ రోల్స్ చేసింది. కానీ నెట్టింట మాత్రం హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. మరి లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
View this post on Instagram