Tech News: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

Tech News: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే


Tech News: మార్చి 1వ తేదీ నుండి భారతదేశంలో మెసేజింగ్ యాప్‌ల వినియోగ నియమాలు పూర్తిగా మారిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దేశీయ డిజిటల్ భద్రతను బలోపేతం చేయడానికి, ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి ఉద్దేశించిన కీలకమైన సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ మార్పులలో ప్రధానంగా సిమ్ బైండింగ్ నియమం, వాట్సాప్ వెబ్ వినియోగదారులకు వర్తించే ఆరు గంటల లాగౌట్ నిబంధన ఉన్నాయి.

కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసినట్లుగా, టెలికాం చట్టం 2023 కింద అమలులోకి వచ్చే ఈ సిమ్ బైండింగ్ అమలు చేస్తున్నారు. నవంబర్ 28, 2023న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి మెసేజింగ్ యాప్‌లు ఇకపై వినియోగదారుల ఫోన్‌లో రిజిస్టర్డ్ నంబర్ యాక్టివ్ సిమ్ కార్డ్ ఉందో లేదో నిరంతరం తనిఖీ చేస్తాయి. అంటే మీరు ఏ ఫోన్ నంబర్‌తో యాప్‌ను రిజిస్టర్ చేశారో, అదే నంబర్ పనితీరు గల సిమ్ కార్డ్ ఆ డివైజ్‌లో ఉండటం తప్పనిసరి. ఒకవేళ సిమ్ కార్డ్ తీసివేసినా, సిమ్ నిలిపివేసినా, లేదా సిమ్ పాడైపోయినా, మీ మెసేజింగ్ యాప్ ఖాతా పనిచేయడం తక్షణమే ఆగిపోతుంది. మళ్లీ అసలు సిమ్‌ను అదే ఫోన్‌లో వేసి ధృవీకరించే వరకు ఖాతాను ఉపయోగించడం సాధ్యం కాదు. బ్యాంకింగ్ యాప్‌లలో ఉండే డివైజ్ బైండింగ్ తరహాలోనే ఇప్పుడు మెసేజింగ్ యాప్‌లకు కూడా ఈ భద్రతను వర్తింపజేస్తున్నారు. ఈ నియమం +91 తో మొదలయ్యే అన్ని భారతీయ నంబర్లకు వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: Income Tax: ఇదేంది మావ సీన్‌ రివర్స్‌ అయ్యింది.. ఈమె ప్లాన్‌ అట్టర్‌ప్లాప్‌.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..!

ఈ కఠినమైన నియమాన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం దేశంలో మితిమీరిన సైబర్ క్రైమ్ కేసులు. టెలికమ్యూనికేషన్స్ శాఖ ఏఐ, డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదికల ప్రకారం, సైబర్ మోసగాళ్లు సిమ్ కార్డ్ లేని డివైజ్‌లను ఉపయోగించి అనామకంగా వాట్సాప్ ఖాతాలను నడుపుతున్నారు. ఇతరుల ఓటీపీలను దొంగిలించి, విదేశాల నుండి భారతీయ నంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సిమ్ బైండింగ్ నియమం దొంగిలించిన ఓటీపీలను ఉపయోగించి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేస్తుంది.

అయితే ఈ కొత్త నియమం డెస్క్‌టాప్‌లు లేదా ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించే నిపుణులు, కార్యాలయ ఉద్యోగులకు కొంత సమస్యగా మారనుంది. ప్రస్తుత వ్యవస్థలో ఒకసారి ల్యాప్‌టాప్‌లో QR కోడ్‌ను స్కాన్ చేసి వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అయితే అది రోజుల తరబడి లేదా నెలల తరబడి లాగిన్‌లోనే ఉండేది. కానీ ఇప్పుడు వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ సెషన్‌లు ప్రతి ఆరు గంటలకు ఒకసారి వాటంతట అవే లాగౌట్ అవుతాయి. కార్యాలయ పనుల కోసం వాట్సాప్‌పై ఆధారపడిన వారు ప్రతి ఆరు గంటలకు ఒకసారి తమ ఫోన్ ద్వారా మళ్లీ QR కోడ్‌ను స్కాన్ చేసి, కొత్తగా ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల రోజువారీ పనులకు, ముఖ్యంగా ఒకే ఖాతాను అనేక ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే చిన్న వ్యాపారులకు ఆటంకం కలుగుతుంది. అయితే మీ ప్రాథమిక మొబైల్‌లో సిమ్ ఉంటే, ఆ మొబైల్ యాప్ వాడకానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. టెక్నాలజీ కంపెనీలకు ఈ నియమాన్ని పాటించడానికి 90 రోజుల సమయం ఇచ్చింది. దీంతో ఆ గడువు కూడా ముగిసింది.

ఇది కూడా చదవండి: Okra Cultivation: ఈ పంట సాగుతో రూ. 3 లక్షల ఆదాయం.. సాగు విధానం ఎలా?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *