టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్స్ లో భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి టీమిండియా సెమీస్కు దూసుకెళ్లింది. డూ ఆర్ డై మ్యాచ్ లో సత్తా చాటి భారత జట్టు సూపర్ విక్టరీ సాధించింది. ఈ కీలక మ్యాచ్ లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 97 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా, భారత్ ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. 196 పరుగుల టార్గెట్ను టీమిండియా 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కోల్కతాలో సంబరాలు మిన్నంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!
US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు
T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్కప్ సెమీస్కు భారత్