రుక్మిణి వసంత్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ అమ్మడు..ఇప్పుడు టాప్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తుంది. కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయ్యింది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. రాంగ్ యాంగిల్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అయ్యారు. హీరోయిన్స్ విషయంలో రాంగ్ యాంగిల్స్ లో ఫోటోస్ తీసి రీల్స్ పేరుతో అన్ పాపులర్ చేసే ప్రైవేట్ ఫోటోగ్రాఫర్స్ తీరుపై మండిపడ్డారు.
తన ట్విట్టర్ ఖాతాలో దీని గురించి పేర్కొంటూ హీరోయిన్లను కించపరిచే విధంగా ప్రవర్తించే ఫోటోగ్రాఫర్స్ చర్యలను ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవడానికి తాము ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
తాను వృత్తిలో భాగంగా నటించడానికి వేస్తున్నామని.. అదే వఇధంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అలాంటి సమయాల్లో తమను రాంగ్ యాంగిల్ చిత్రీకరించే కొందరు ప్రైవేట్ ఫోటోగ్రాపఱ్స్ చర్యలు తీవ్రంగా ఖండిస్తామని పేర్కొన్నారు.
నటీమణులను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకడామని అన్నారు . మరోవైపు ఇదివరకే హీరోయిన్ సప్తమి గౌడ సైతం ఫోటోగ్రాఫర్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ శరీరాలను జూమ్ చేసి మరీ ఫోటోస్ తీయొద్దని అన్నారు.




