Headlines

రికార్డు సృష్టించిన స్మృతి మంధాన.. అంతర్జాతీయ క్రికెట్‌లో నెం.1 బ్యాటర్‌గా రికార్డ్‌

భారత మహిళల క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు చేసి గ్రౌండ్ నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగింది. మహిళల టీ20 ఆసియా కప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు ఇప్పుడు ఆమె…

Read Full News

మిస్ వరల్డ్ 2026 కిరీటం దక్కించుకున్న జోహెరీ మోలా! ఈమెది ఏ దేశమంటే?

మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ సొంతం చేసుకున్నారు. 73వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విజేతగా నిలిచిన థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ చేతుల మీదుగా జోహెరీకి కిరీటధారణ జరిగింది. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’తో ఆకట్టుకున్న జోహెరీ…

Read Full News

BRICS-2026: ప్రపంచ నేతలంతా ఢిల్లీకి పయనం.. బ్రిక్స్ సమ్మిట్-2026 షెడ్యూల్ ఇదే..!

న్యూఢిల్లీ: ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల్లో కీలకంగా మారిన బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సమ్మిట్-2026 జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కీలక సమావేశానికి సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బ్రిక్స్ సభ్య దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల అధినేతలు, ఆహ్వానితులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు….

Read Full News

Dream Meaning: కలలో మీ మరణాన్ని చూడటం శుభానికి సంకేతమా..? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?

Death in Dream Meaning Telugu: మనిషి నిద్రలోకి జారుకున్న తర్వాత ఎన్నో రకాల కలలను అనుభవిస్తాడు. కొన్ని కలలు ఉదయం నిద్ర లేవగానే గుర్తుండవు. మరికొన్ని మాత్రం మనసులో బలమైన ముద్ర వేస్తాయి. ముఖ్యంగా తన మరణాన్ని తానే చూసుకున్నట్లు కల రావడం చాలామందిని భయాందోళనకు గురిచేస్తుంది. అసలు ఇలాంటి కలలకు అర్థం ఏమిటి? ఇవి నిజంగా ఏదైనా అపశకునాన్ని సూచిస్తాయా? స్వప్న శాస్త్రానికి సంబంధించిన కొన్ని సంప్రదాయ నమ్మకాల ప్రకారం, ప్రతి కలకూ ఒక…

Read Full News

ఇంటర్‌ మార్కులతో నేరుగా అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగాలు.. సెప్టెంబర్‌ 10 వరకే అవకాశం!

తెలంగాణలోని మహిళలు, నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 125 అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు…

Read Full News

Tollywood: రాజబాబుతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.. చిన్న చిన్న పాత్రలతో ఫేమస్.. చివరకు ఎలా చనిపోయారంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది హాస్యనటులు తమదైన ముద్ర వేసుకున్నారు. కస్తూరి శివరావు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు వంటి ప్రముఖుల సరసన నిలిచే స్థాయి లేకపోయినా, చిన్న చిన్న పాత్రలతోనే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హాస్యకళాకారులలో చిడతల అప్పారావు ఒకరు. ఆయన జీవితం, సినీ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. అప్పారావు స్వస్థలం రాజమండ్రి. ఆయన ఇంటిపేరు చిడతల కాదు, వై. చిన్నతనం నుంచే నాటకాలంటే ఎనలేని ఆసక్తి ఉండడంతో చదువు పెద్దగా కొనసాగించలేదు. శ్రీకృష్ణ…

Read Full News

PM Modi: సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి.. జాతీయ ఉత్తమ టీచర్లతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ..

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసం జరిగిన ఈ ఆత్మీయ కలయికలో ప్రధానమంత్రి ఉపాధ్యాయులతో ఎంతో ఉల్లాసంగా ముచ్చటించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్రను కొనియాడటంతో పాటు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను ఆయన స్మరించుకున్నారు. నవ్వులు పూయించిన ముచ్చట్లు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తమ విద్యాబోధనలోని వినూత్న పద్ధతులను ప్రధానితో పంచుకున్నారు. పిల్లలకు ఇంటర్వ్యూలు…

Read Full News

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. బస్సు జర్నీ ఫ్రీ.. అందరికీ అవకాశం..

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ సంస్థ టీటీడీకి 15 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించింది. ఈ బస్సులు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేయగా.. ఇవి తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గతంలో టీటీడీకి 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను విరాళంగా ప్రకటించారు. వీటిల్లో 15 బస్సులు ఇప్పటికే అందించగా.. మిగతా 10 బస్సులు త్వరలోనే తిరుమలకు చేరుకోనున్నాయి….

Read Full News

నెలల తరబడి ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టూ.. డచ్‌ CEO నుంచి జాబ్‌ ఆఫర్‌!

భోపాల్, సెప్టెంబర్ 6:  మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి, సోషల్ మీడియాలో ‘బిట్టు తబాహీ’గా గుర్తింపు పొందాడు. స్థానికంగా తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిను శుభ్రం చేసేందుకు ఆయన నెలలుగా నిరంతరం పనిచేస్తున్నాడు. నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, ఇతర వ్యర్థాలను స్వయంగా తొలగించడంతో పాటు.. నది పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాలను కూడా శుభ్రం చేస్తున్నాడు. ఎవరి సహాయం లేకుండానే.. సురేంద్ర చేపట్టిన ఈ కార్యక్రమం వెనుక పెద్ద పర్యావరణ సంస్థ లేదు. ప్రభుత్వ…

Read Full News

22 నెలల్లో 20 టన్నులు.. కుప్పలు తెప్పలుగా బంగారం కొంటున్న చైనా.. డ్రాగన్ అసలు ప్లాన్ ఇదేనా!

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని.. యవత్ ప్రపంచ గగ్గోలు పెడుతుంటే.. చైనా మాత్రం భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుంది. గడిచిన 22 నెలలుగా ఏకంగా 20 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. దీంతో ఎందుకు చైనా ఇప్పుడు ఇంత బంగారం కొంటోందన్న చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. ఇది ఏదో ఒక్క నెల తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం కాదు. రాబోయే దశాబ్ద కాలం కోసం పక్కా వ్యూహంతో ఆ దేశ కేంద్ర బ్యాంకు భారీ ప్రణాళికను అమలు…

Read Full News