Andhra Pradesh: మహిళలకు ఇది కదా కావాల్సింది.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 8న బహిరంగ సభ వేదికగా ఈ వరాల జల్లు కురిపించనున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వంటి ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. కేవలం పావలా వడ్డీకే రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పిస్తూ, అటు ఆడబిడ్డల…