Ontimitta: ఒంటిమిట్ట రాములోరికి ఈ భక్తుడు ఏం చేయించాడంటే..?
రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ విరాళం అందించారు. సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన మూడు బంగారు కిరీటాలను ఆలయానికి సమర్పించారు. శ్రీరాముల వారి కళ్యాణోత్సవ వేళ ఆలయం ముస్తాబవుతున్న సమయంలో ఈ విరాళం అందజేయడం విశేషంగా నిలిచింది. కళ్యాణం సందర్భంగా ఉత్సవ విగ్రహాలు పురవీధుల్లో విహరిస్తాయి. ఆ విగ్రహాలకు అలంకరణగా ఉండేలా సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడి…