‘రోడ్లు ఊడ్చే స్వీపర్ల నెల జీతం రూ.2 లక్షలు.. IAS, గవర్నర్ల కంటే వీళ్ల జీతాలే ఎక్కువ’.. వేతన సవరణ చట్టంతో కొత్త చిక్కులు
హైదరాబాద్, ఫిబ్రవరి 27: 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.1600 కోట్లుగా ఉన్న పెన్షన్లు జీతాల బిల్లు.. గత పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగి ఇప్పుడు రూ.6,000 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు అన్నారు. వేతన సవరణ కమిషన్ల సిఫార్సుల అమలుతో కొన్ని విద్యుత్ సంస్థల్లో సీనయిర్ స్వీపర్ల జీతం నెలకు రూ.2 లక్షలకు పెరిగిందని అన్నారు. ఇక విద్యుత్ సంస్థల చీఫ్ ఇంజనీర్ల జీతం రూ.7 లక్షలకు చేరుకుంటుందని ఈ సమావేశంలో…