కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ??
8వ వేతన సంఘం ఏర్పాటు తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల కనీస వేతనాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 18,000 నుండి ఏకంగా రూ. 69,000కు పెంచాలంటూ నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ మేరకు 8వ పే కమిషన్కు సమర్పించిన మెమోరాండంలో ఈ డిమాండ్ ఉంచింది. సాధారణంగా వేతనాల పెంపు అనేది ‘ఫిట్మెంట్ ఫ్యాక్టర్’ పై ఆధారపడి ఉంటుంది. 7వ వేతన…