Headlines

ప్రాచీన కాలంనాటి ఈ జావ ఒక్కసారి తాగితే చాలు.. ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్

మినుముల జావకు కావాల్సిన పదార్థాలు : పావు కప్పు మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ బియ్యం , పావు టీ స్పూన్ మెంతులు, నాలుగు యాలకలు, అర కప్పు బెల్లం తురుము, సరిపడా నీరు, అర కప్పు బెల్లం తురుము, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము , చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ సొంఠి పొడిని తీసుకోవాలి. మినుముల జావ తయారీ విధానం: ముందుగా పావు కప్పు మినపప్పును తీసుకుని లో ఫ్లేమ్ లో…

Read Full News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల…

Read Full News

Konda Surekha: అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ.. కొండా దంపతుల సైలెన్స్ వెనుక మతలబేంటీ..?

మంత్రి పదవి ఊస్టింగ్ తర్వాత.. కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ చెబుతున్నా.. వారికి ప్లాన్ బి కూడా ఉందని, పార్టీ మారతారని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అవమానాలు భరిస్తూ.. కాంగ్రెస్‌లో ఎందుకు కొనసాగాలని కొండా కేడర్ ప్రశ్నిస్తుండగా.. ఇప్పటికైతే సైలెంట్‌గా ఉన్న కొండా దంపతులు.. కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీలో చేరడం పక్కా అన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. అయితే.. తను గతంలో పనిచేసిన బీఆర్ఎస్‌లోకి వెళ్తారా?. లేక కొత్తగా బీజేపీలో చేరతారా?….

Read Full News

Telangana Auto Drivers: ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్.. సెప్టెంబర్ 7న కీలక సమావేశం!

తెలంగాణలో ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశాలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7న సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ భేటీ జరగనుంది. డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆటో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది….

Read Full News

Moral Story: జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని 3 గొప్ప పాఠాలు.. వేటగాడు-డేగ కథ

ఓ ఊరిలో ఓ వేటగాడు ఉండేవాడు. అతడు తన కుటుంబాన్ని పోషించడానికి ప్రతిరోజూ అడవికి వెళ్లి వేటాడేవాడు. ఓ రోజు ఉదయం కూడా ఏదైనా వేట దొరుకుతుందనే ఆశతో అడవికి బయలుదేరాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవంతా వెతికినా ఒక్క జంతువూ అతడి కంటపడలేదు. చివరికి అలసిపోయి, నిరాశతో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ‘ఈ రోజు నా కుటుంబం ఆకలితో పడుకోవాల్సిందేనా?’ అని ఆందోళన చెందుతున్న సమయంలో అతడికి చెట్టు పైభాగం నుంచి గలగల…

Read Full News

ఏంది, చావును కూడా ఆపేస్తుందా.. ఈ ఫ్లవర్ అంత పవర్ ఫుల్లా..!

Shanku Pushpam: ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన వాటిలో శంఖపుష్పం (Clitoria Ternatea), లేదా బటర్ ఫ్లై పీ ఫ్లవర్ ఒకటి. కేవలం ఒక చుక్క నిమ్మరసం కలిపితే రంగు మారిపోయే దీని మంత్రం లాంటి స్వభావం, అనేక ఆరోగ్య రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. సాంప్రదాయ ఆయుర్వేదం, సహజ ఆరోగ్య పద్ధతులలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. మన పూర్వీకులు దీనిని సంస్కృతంలో అపరాజిత అని పిలిచేవారు, అంటే “దేనికీ ఓడిపోనిది” అని అర్థం. ఈ…

Read Full News

9/11 విషాదం.. ఆ రోజున షిఫ్ట్ మారడం సిబి ప్రాణాలను కాపాడింది

అంతకు ముందు రెస్టారెంట్‌లో పనిచేసే సహోద్యోగి రివాస్ తో మాట్లాడి సిబి తన షిఫ్ట్‌ను మార్చుకున్నాడు. రివాస్‌కు ఆదివారం సెలవు కావాల్సి ఉండటంతో, సిబి అతనికి బదులుగా పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. సీఎన్ఎన్  కథనం ప్రకారం 9/11 ఉదయం  సిబి షిఫ్ట్‌లో రివాస్ విధులకు హాజరయ్యాడు. ప్రాణాలు కోల్పోయిన సహోద్యోగులు ఆ రోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో అల్ ఖైదా జరిపిన దాడిలో 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో సిబి షిఫ్ట్‌లో పనిచేసిన  రివాస్ కూడా…

Read Full News

Cinema : కేవలం రెండే పాత్రలు.. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పిచ్చెక్కించే ట్విస్టులు.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఒక మలుపు ఉంటుంది. కానీ సినిమా మొత్తం ట్విస్టులే ఉంటే.. అలాంటి చిత్రాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. కేవలం రెండే పాత్రలు.. వారి మధ్య జరిగే సంఘటనలు. వాటిలో ఉండే అనేక మలుపులు. అదే లెవల్ క్రాస్. 2024లో విడుదలైన మలయళీ థ్రిల్లర్ సినిమా. ఇందులో ఆసిఫ్ అలీ, అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో…

Read Full News

Telangana: 400 ఏళ్ల నాటి బావి.. చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సజీవ సాక్ష్యం

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని రాఘవేంద్రనగర్‌లో గల ఓ పురాతన మెట్లబావి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. స్థానికులు దీనిని పుష్కరిణిగా భావిస్తూ పూజిస్తుంటారు. 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ అద్భుతమైన కట్టడం నేటికీ చెక్కుచెదరక, నిత్యం నీటితో నిండి ఉండటం జలసంరక్షణ పట్ల మన పూర్వీకులకున్న దూరదృష్టిని తెలియజేస్తుంది. ఈ చారిత్రక బావి స్థానికులకు కేవలం నీటి వనరు మాత్రమే కాదు, ఒక దైవ సంబంధమైన ప్రదేశం. స్థానికుల ప్రగాఢ విశ్వాసం ప్రకారం,…

Read Full News

300 ఏళ్ల తర్వాత రామప్పలో తెరుచుకున్న సోమసూత్రం.. ఎలా తెరిచారో తెలుసా..!

వరంగల్‌, సెప్టెంబర్ 7: తెలుగు రాష్ట్రాలలో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక నిర్మాణం రామప్ప దేవాలయం. ఈ ఆలయాన్ని కాకతీయుల పరిపాలన సమయంలో క్రీ.శ.1213లో ప్రారంభించి 40 సంవత్సరాల పాటు అబ్బురపరిచే శిల్పాలతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతుంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని పరిపాలనా సమయంలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ చారిత్రక ఆలయాన్ని నిర్మించారు. భారతదేశంలో ఒక శిల్పిపేరిట పిలువబడే ఏకైక ఆలయంగా రామప్పకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది…..

Read Full News