TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకోనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇకపై శ్రీవారి హుండీ కానుకలను డిజిటల్ పేమెంట్ రూపంలోనూ సమర్పించేలా టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో చిల్లర నాణేలు వేస్తున్నారు. ఇకపై నాణేలకు బదులు ముడుపుపత్రాల రూపంలో వేసేందుకు వీలుగా తిరుపతి, తిరుమలలో టీటీడీ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చించనున్నారు. భక్తులు తమ మొక్కులను…