Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్ ధర
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ ఓడరేవులు మూతపడటంతో భారత్కు రావాల్సిన డ్రై ఫ్రూట్స్ సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం ఏలూరు, తణుకు మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పిస్తా, అంజీర్, ఖర్జూరం ధరలు భారీగా పెరిగాయి. రానున్న వారాల్లో మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో కేజీ రూ.2000లు పలికిన పిస్తా ధర ఇప్పుడు రూ.2,200లు పలుకుతోంది. కేజీ పిస్తా సాల్ట్ రూ.1100 నుంచి…