యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం.. పర్యాటకంగానూ విస్తరిస్తోంది. ఆధ్యాత్మికం, చారిత్రకం, అహ్లాదం మూడు విభాగాల్లో రాష్ట్రంలో యాదగిరిగుట్ట దేవస్థానం అగ్రగామిగా నిలిచింది. దీంతో స్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటుండగా.. యాదాద్రిలో కూడా భక్తుల సంఖ్య ఇంచుమించు అంతే ఉంటోంది. గత ఏడాది రాష్ట్రంలోనే అత్యధికంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. పునర్ నిర్మాణంతో…