Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీ శివసాయి శ్రీనివాస నాట్యాలయం వ్యవస్థాపకురాలు, గురువు బలివాడ గ్రీష్మ నేతృత్వంలో కళాకారులు చేసిన ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువు గ్రీష్మతో పాటు ఆమె వద్ద శిక్షణ పొందుతున్న 20 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహ స్వామి వారి వైభవాన్ని చాటి చెప్పే పలు భక్తి గీతాలకు వారు అద్భుతమైన నృత్య…