పేరుకు జాతీయ ప్రాజెక్.. కష్టాల్లో కామధేను.. నోరులేని మూగ జీవుల గోస తీర్చేదేవరు..?
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవిలోని పశుగణాభివృద్ధి క్షేత్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రం ప్రస్తుతం నీటి సమస్య, సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. స్వదేశీ జాతి గోవులు, గేదెల అభివృద్ధి లక్ష్యంగా 2015లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అదే ఏడాది బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించినప్పటికీ, ప్రారంభ దశలో కేవలం రూ.25 కోట్లు మాత్రమే విడుదల కావడంతో పనులు మొదలయ్యాయి. దేశంలో రెండవదిగా, దక్షిణ భారతదేశంలో మొదటిదిగా స్థాపించిన ఈ కేంద్రంలో…