చల్ల చల్లని కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వచ్చే 3రోజుల వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం తీవ్రమైన ఉక్కపోత, వేడితో అల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి, దక్షిణ – నైరుతి దిశగ గాలుల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉత్తర అంతర కర్ణాటక…