ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక!
నేపాల్ నుంచి వస్తున్న వరద నీటితో అతలాకుతలమవుతున్న బీహార్కు మరో కొత్త భయం పట్టుకుంది. వరద ఉధృతికి జలాశయాల నుంచి కొట్టుకొస్తున్న అసాధారణంగా ఉన్న, గుర్తుతెలియని చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ వనరుల శాఖ కీలక ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. వరదల్లో మురుగునీరు, రసాయనాలు, చనిపోయిన జంతువుల వ్యర్థాలు కలవడంతో ఆ నీటిలో ప్రయాణించే చేపలు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం…