Headlines

Telangana: వర్షాల కోసం వినూత్న పూజలు.. గుట్టపై ‘వరద పాశం’

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామస్థులు సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ వినూత్నంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సంజీవరాయని గుట్టపై వెలసిన ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. పాలతో ‘వరద పాశం’ వంటకం గ్రామస్థుల విశ్వాసం ప్రకారం.. సంజీవరాయని గుట్టపై ‘వరద పాశం’ పోస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్మకం. ఇందులో భాగంగా ఆవు, గేదె,…

Read Full News

Video: ఓవర్ యాక్షన్‌తో దూలతీర్చిన ఐసీసీ.. పాకిస్థాన్ కెప్టెన్‌కు భారీ జరిమానాతోపాటు..!

ICC fine Fatima Sana: భారత్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ 2026 మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక చర్యలు తీసుకుంది. మ్యాచ్ సందర్భంగా ఆమె ప్రవర్తనను నిబంధనలకు విరుద్ధంగా పరిగణించిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఏమి జరిగిందంటే? భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో ఫాతిమా సనా చేసిన ఓ సంజ్ఞ వివాదానికి దారితీసింది. మ్యాచ్‌లో ఆమె ప్రవర్తనను…

Read Full News

వినాయకుడి బొజ్జలో సైబర్ సీక్రెట్..! గణపయ్య రూపంలో పోలీసుల వినూత్న వార్నింగ్..!

గణేష్‌ నవరాత్రులు వచ్చాయంటే సందడి మామూలుగా ఉండదు.. మండపాలు, పూజలు, విరాళాల సేకరణతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. అయితే ఇదే సందడిని సైబర్‌ కేటుగాళ్లు క్యాష్‌ చేసుకునే ప్రమాదం ఉంది. ఫేక్‌ విరాళాల నుంచి నకిలీ QR కోడ్‌ల వరకు.. పండగ వేళ జరిగే సైబర్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పండగ వాతావరణాన్ని కూడా సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు….

Read Full News

చిన్న ముక్కతో బాడీలో మహా అద్భుతం.. భరించలేని గ్యాస్, ఎసిడిటీ పోయి పొట్ట ఫ్రీగా..

మనలో చాలా మంది ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే, మీరు ఉదయం పూట దీనిని తీసుకుంటే చాలు. ఇంకా చెప్పాలంటే పరగడుపున దీనిని తీసుకుంటే ఇంకా మంచిది. ఒక చిన్న ఆహారపు అలవాటును మార్చుకోవడం వలన మీ పొట్టను మంచిగా క్లీన్ అవుతుంది. మరి, అసలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చూద్దాం.. ఈ బిజీ లైఫ్ లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా, జంక్…

Read Full News

మెడికల్ మిరాకిల్! వ్యక్తికి పంది కిడ్నీ అమర్చగా.. ఫస్ట్ టైమ్ 9 నెలలు పని చేసింది ..!!

అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూకి రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. వాటిని తొలగించి కొత్త కిడ్నీ అమర్చాలని డాక్టర్లు సూచించారు. ఆయన కుటుంబ సభ్యులు డోనర్ కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఎవరూ దొరకలేదు. ఈ నేపథ్యంలో వైద్యులు అతనికి జన్యుపరంగా మార్పు చేసిన (జెనటికల్లీ ఎడిటెడ్) పంది కిడ్నీని అమర్చారు.  ఈ సర్జరీ 2025 జనవరిలో జరిగింది. ఆండ్రూ పంది కిడ్నీ సహాయంతో, డయాలసిస్ అవసరం లేకుండా 9 నెలలు గడిపాడు. ఆ తర్వాత…

Read Full News

Bigg Boss Telugu 10: ‘నాతో పెట్టుకోవద్దు.. ఆ కంటెస్టెంట్‌కు రామ్ ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే? వీడియో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రచ్చ మొదలైంది. మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు తిట్టేసుకున్నారు. ఇక నామినేషన్స్ సందర్భంగా ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడూ సరదాగా కనిపించే జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఉన్నట్లుండి సీరియస్ అయ్యాడు. తోటి కంటెస్టెంట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు…

Read Full News

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. శుక్రవారం నగర వ్యాప్తంగా మాంసం షాప్‌లు బంద్!

హైదరాబాద్, 02 సెప్టెంబర్ 2026: హైదరాబాద్‌లోని మాంస విక్రయదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక సూచనలు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 04 సెప్టెంబర్ 2026న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన…

Read Full News

Vaibhav Sooryavanshi: నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఇతడే.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ మైండ్ బ్లోయింగ్ ప్లాన్

Vaibhav Sooryavanshi: భారతదేశ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌లా సుదీర్ఘకాలం సేవలు అందించే కొత్త లెజెండ్‌ను తయారుచేసేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ జరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సహా…

Read Full News

Andhra: సీక్రెట్‌గా ఎలా చేరుతున్నాయ్..? మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్..

ఏపీ మత్తు ఇంజెక్షన్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.. దీని వెనుక పలువురి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో యువతను మత్తులో ముంచుతున్న అక్రమ ఇంజెక్షన్ల దందాపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సాయికిషోర్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి సౌజన్య నగర్‌కు చెందిన సాయి కిషోర్… ‘శ్రీ లక్ష్మి శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మెడికల్ ఏజెన్సీ లైసెన్స్‌ను సంపాదించిన కిషోర్… అదే లైసెన్స్‌ను అడ్డం పెట్టుకుని…

Read Full News

Parenting Tips: పిల్లలు ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఎదగాలంటే.. పేరెంట్స్ ఈ 30 నిమిషాలు మిస్ కావద్దు!

పిల్లలు ఉదయం నిద్రలేచిన తర్వాత 10 నిమిషాలు, పాఠశాల నుంచి ఇంటికి వచ్చినప్పుడు లేదా వారికి తల్లిదండ్రుల అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో మరో 10 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు పిల్లలతో గడపాలి. ఈ సమయంలో మొబైల్ పక్కన పెట్టి, పిల్లలతో కళ్లలోకి చూస్తూ మాట్లాడటం, వారి మాటలను శ్రద్ధగా వినడం, కలిసి నవ్వడం, అవసరమైతే కౌగిలించుకోవడం వంటి చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి స్థిరమైన అనుబంధం పిల్లల్లో భద్రతా భావన,…

Read Full News