Telangana: వర్షాల కోసం వినూత్న పూజలు.. గుట్టపై ‘వరద పాశం’
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామస్థులు సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ వినూత్నంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సంజీవరాయని గుట్టపై వెలసిన ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. పాలతో ‘వరద పాశం’ వంటకం గ్రామస్థుల విశ్వాసం ప్రకారం.. సంజీవరాయని గుట్టపై ‘వరద పాశం’ పోస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్మకం. ఇందులో భాగంగా ఆవు, గేదె,…