Actor AVS: మనందరినీ కడుపుబ్బా నవ్వించిన ఏవీఎస్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం కూతురు కాలేయం ఇచ్చినా..
నటుడు ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాతో నటుడిగా మారారు. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మళ్లీ మొదలైంది.. ఇలా దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు…