సెమీకండక్టర్ రంగంలో కొత్త దిశ… ఒడిశాలో భారీ ప్రాజెక్ట్ ప్రారంభం
భారత్ సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఏప్రిల్ 19, 2026న దేశంలోనే తొలి అత్యాధునిక త్రిమితీయ గాజు ఆధారిత సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కు శంకుస్థాపన జరగనుంది. ఇప్పటివరకు విదేశాలపై ఆధారపడిన చిప్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి వైపు సాగుతోందనే సంకేతంగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. ఏంటి ఈ యూనిట్ ప్రత్యేకత? సెమీకండక్టర్ అంటే ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, డేటా సెంటర్లు.. అన్నింటికీ ప్రాణం. కానీ చిప్ తయారీ అంటే…