ఏపీకి రైల్వేశాఖ తీపికబురు.. నాలుగు మెగా టెర్మినల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. ఎక్కడెక్కడంటే..?
ఆంధప్రదేశ్కు రైల్వేశాఖ సూపర్ న్యూస్ అందించింది. ఏపీలో నాలుగు నగరాల్లో మోగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. విశాఖపట్నంతో పాటు అమరావతి, తిరుపతి, గన్నవరంలో వీటి నిర్మాణానికి మొగ్గు చూపింది. వీటి నిర్మాణానికి భూమి కేటాయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని రైల్వేశాఖ కోరగా.. కూటమి సర్కార్ కూడా అంగీకరించింది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేయగా.. భూమి కేటాయించాక రైల్వేశాఖ పనులను మొదలుపెట్టనుంది. ఈ టెర్మినల్స్ వల్ల అనేక లాభాలు ఉంటాయి. సమీపంలోని పెద్ద స్టేషన్లపై ఒత్తిడి తగ్గడంతో…