Toll Rules: నేషనల్ హైవేలపై నేటి నుంచి కొత్త రూల్స్.. పరిమితి దాటితే బాదుడే.. కేంద్రం కఠిన నిబంధనలు
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై రోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. దీంతో టోల్ ఫీజులకు సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయాలు కోట్లాది మందిని ప్రభావితం చేస్తాయి. ఇటీవల టోల్ ఫీజు విధానంలో అనేక మార్పులు చేస్తున్న కేంద్రం.. తాజాగా మరో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఓవర్ లోడ్తో వెళ్లే వాహనాలకు కఠిన నిబంధనలు ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి నేషనల్ హైవేలపై ఓవర్ లోడ్తో వెళితే అదనపు పెనాల్టీ…