ఇదేందయ్యా ఇదీ.. వధువు ఒక్కరే.. వరులు మాత్రం ఇద్దరా !!
సినిమాల్లో కూడా ఊహించని రేంజ్లో ఉత్తరప్రదేశ్లో విచిత్ర సంఘటన జరిగింది. ఒకే పెళ్లి వేదిక.. ఒకే వధువు.. కానీ ఊరేగింపుగా ఇద్దరు వరులు రావడంతో అక్కడ ఉన్నవారందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అమ్రోహా జిల్లాలో జరిగిన ఈ విచిత్ర పెళ్లి పంచాయితీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అమ్రోహా జిల్లాకు చెందిన ఓ యువతికి మొదట మొరాదాబాద్కు చెందిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయింది. వెంటనే వధువు కుటుంబ…