ఆకాశంలో అద్భుతం.. గ్రహణం వేళ బ్లడ్ మూన్ కనువిందు
భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూ వాతావరణం సూర్యకాంతిని వక్రీకరించి, కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రునిపైకి ప్రసరింపజేస్తుంది. దీని వల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి.. దాన్ని ‘బ్లడ్మూన్’ అని పిలుస్తారు. చంద్రునిపై భూమి నీడ దాదాపు ఒక గంట రెండు నిమిషాల పాటు పడనుంది. ఇండియాలో ప్రజలు బ్లడ్మూన్ను కొంత సమయం పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది….