North Carolina: అగ్రరాజ్యంలో మరోసారి పేలిన తూట.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

North Carolina: అగ్రరాజ్యంలో మరోసారి పేలిన తూట.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి


North Carolina: అగ్రరాజ్యంలో మరోసారి పేలిన తూట.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకం రేపాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలో ఒక రెస్టారెంట్‌ వద్దకు వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకితో కాల్చడం స్టార్ట్ చేశాడు. ఈ దాడిలో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌పోర్ట్ యాచ్ బేసిన్ సమీపంలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి. సడెన్‌గా ఒక బోట్‌లో అక్కడికి చేరుకున్న ఒక గుర్తుతెలియని వ్యక్తి.. తన దగ్గర ఉన్న తుపాకీతో రెస్టారెంట్‌లోని వ్యక్తులను టార్గెట్‌గా చేసుకోని కాల్పులకు పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారియారు.

దుండగుడి కాల్పుల్లో రెస్టారెంట్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. మరోవైపు గాయపడిన వారికి కూడా హాస్పిటల్‌కు తరలించారు.

ఇక ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు కాల్పులకు గల కారణాలను కనుగొనే పనిలో పడ్డారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *