News9 Indian Tigers and Tigresses Season 2: జాతీయ ట్రయల్స్‌లో ప్రతిభ చాటుతున్న యువ ఫుట్‌బాలర్లు

News9 Indian Tigers and Tigresses Season 2: జాతీయ ట్రయల్స్‌లో ప్రతిభ చాటుతున్న యువ ఫుట్‌బాలర్లు


News9 Indian Tigers and Tigresses Season 2: జాతీయ ట్రయల్స్‌లో ప్రతిభ చాటుతున్న యువ ఫుట్‌బాలర్లు

టీవీ9 నెట్‌వర్క్ చేపట్టిన News9 Indian Tigers & Tigresses ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయి ట్రయల్స్ రెండో రోజు అస్సాంలోని డిబ్రుగఢ్‌లో ఉన్న ఖానికర్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా కొనసాగాయి. తుది ఎంపిక దశకు చేరువైన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులు తమ ప్రతిభను మరింతగా నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ట్రయల్స్ రెండో రోజు ప్రధానంగా ఆటలో వ్యూహాత్మక అవగాహన, మ్యాచ్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టారు. క్రీడాకారుల టెక్నికల్ స్కిల్స్‌కే కాకుండా ఒత్తిడిలో ఎలా ఆడతారు, ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు, శారీరకంగా ఎంత దృఢంగా ఉంటారు అన్న అంశాలను కోచ్‌లు పరిశీలించారు.

ఉదయం సెషన్లలో క్రీడాకారులకు ప్రత్యేక డ్రిల్స్ నిర్వహించారు. ఇందులో వారి పొజిషనల్ అవగాహన, మ్యాచ్ పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు, టీమ్‌వర్క్ సామర్థ్యాన్ని అంచనా వేశారు. వేగంగా మారే మ్యాచ్ పరిస్థితుల్లో ఆటను ఎలా చదువుతారు, ప్రత్యర్థి కదలికలను ముందుగానే ఎలా అంచనా వేస్తారు, వ్యూహాత్మక నిర్ణయాలను ఎంత త్వరగా అమలు చేస్తారు అన్న అంశాలపై కోచ్‌లు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇదే సమయంలో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ పరీక్షలు కూడా కీలకంగా నిర్వహించారు. స్ప్రింట్ టెస్టులు, ఎండ్యూరెన్స్ రన్స్, అజిలిటీ డ్రిల్స్, హై ఇంటెన్సిటీ ఫిజికల్ వ్యాయామాల ద్వారా క్రీడాకారుల శారీరక సామర్థ్యాన్ని పరీక్షించారు.

National Football Trials

చాలా మంది యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ట్రయల్స్ రెండో రోజు కీలకంగా మారింది. ఎందుకంటే కోచ్‌లు, సెలెక్టర్లు ఇప్పుడు తుది ఎంపికకు దగ్గరగా ఉండే ఆటగాళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ప్రారంభించారు. కేవలం బంతితో నైపుణ్యం చూపడం మాత్రమే కాకుండా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆటపై అవగాహన ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయాలని వారు చూస్తున్నారు.

తుది ఎంపిక దశలో News9 Indian Tigers & Tigresses

దేశవ్యాప్తంగా 38 వేలకుపైగా పిల్లలు పాల్గొన్న News9 Indian Tigers & Tigresses కార్యక్రమం ఇప్పుడు తుది జాతీయ ఎంపిక దశకు చేరుకుంది. పలు రౌండ్ల స్క్రీనింగ్, ప్రాంతీయ ట్రయల్స్ తర్వాత సుమారు 300 మంది ఆటగాళ్లు ఈ జాతీయ దశకు ఎంపికయ్యారు. ఈ 300 మంది నుంచి చివరకు కేవలం 25 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు జర్మనీకి వెళ్లి ఆధునిక ఫుట్‌బాల్ శిక్షణతో పాటు అంతర్జాతీయ అనుభవాన్ని పొందే ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమంలో భారత్‌ను ప్రాతినిధ్యం వహించనున్నారు. ట్రయల్స్ మరింత ఉత్కంఠగా మారుతున్న నేపథ్యంలో డిబ్రుగఢ్‌లో పోటీపడుతున్న యువ క్రీడాకారులు ప్రతి డ్రిల్, ప్రతి స్ప్రింట్, ప్రతి వ్యూహాత్మక నిర్ణయం తమ భవిష్యత్తును నిర్ణయించగలదని బాగా అర్థం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచి వెలుగులోకి వస్తున్న ఫుట్‌బాల్ ప్రతిభను ఈ జాతీయ ట్రయల్స్ మొదటి రెండు రోజులు స్పష్టంగా చూపించాయి.

Young Footballers

మొదటి సీజన్‌కు ప్రధాని మోదీ ఆశీర్వాదం

ఈ ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ కార్యక్రమం తొలి సీజన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మకంగా శుభారంభం చేశారు. 2025 మార్చిలో ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే 2025 (WITT 2025) గ్లోబల్ సమ్మిట్‌లో ఎంపికైన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. యూరప్ పర్యటన విజయవంతంగా పూర్తిచేసుకుని తిరిగొచ్చిన ఈ యువ క్రీడాకారులను కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, భారతదేశంలోని ఆస్ట్రియా రాయబారి కాథరినా వైసర్ ఆస్ట్రియన్ ఎంబసీలో సత్కరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *