జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికల వల్ల ద్వాదశ రాశులవారిపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. మార్చి నెలలో ఒక శక్తివంతమైన యోగం ఏర్పడనుంది. మార్చి 3 నుంచి 26 వరకు ప్రేమ, దాంపత్యం, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలకు కారకుడైన శుక్రుడు తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయనున్నాడు. శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన మహాభాగ్య యోగం ఏర్పడి, ధనలాభాలు, గౌరవం, శుభ పరిణామాలు వరుసగా చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, కుంభం, మీన రాశుల వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉండనుంది.