Khammam: మరి ఇంతకన్నా పాపం ఉంటుందరా.. అన్నం తింటుండగా కూర వేయలేదని..

Khammam: మరి ఇంతకన్నా పాపం ఉంటుందరా.. అన్నం తింటుండగా కూర వేయలేదని..


ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. అన్నం తింటుండగా కూర వేయలేదని కోపంతో రుక్మిణి అనే మహిళపై రవి అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఇద్దరూ కిటికీలు తయారు చేసే ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. భోజనం సమయంలో చిన్న విషయంపై మాటామాటా పెరిగి రవి ఆగ్రహంతో రుక్మిణిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *