
టాలీవుడ్ మల్లీశ్వరి తల్లి కాబోతుంది. అదేనండి.. బాలీవుడ్ హీరోయిన్, విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని కత్రినా దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న కత్రినా ఫొటోలను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజనలు కత్రినా-విక్కీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కత్రినా-విక్కీ దంపతుల ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram