
సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్నకు బహిరంగ లేఖ రాయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. భారతదేశం ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశం అని, ఇకపై సుదూర దేశం నుంచి ఆదేశాలు తీసుకోదని ఆయన పేర్కొన్నారు. కమల్ హాసన్ ఈ లేఖను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో పంచుకున్నారు. “భారతదేశం ఒక స్వేచ్ఛా దేశం, ఏదైనా విదేశీ శక్తి నుండి సూచనలు తీసుకునే సమయం ముగిసింది” అని కమల్ హాసన్ తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు తన సొంత వ్యాపారంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. దేశాల మధ్య పరస్పర గౌరవం ప్రపంచంలో శాశ్వత శాంతికి పునాది అని ఆయన అన్నారు. తనను తాను గర్వించదగిన భారతీయ పౌరుడిగా అభివర్ణించుకుంటూ, తన పార్టీ మక్కల్ నీది మైయం వ్యవస్థాపకుడిగా సంతకం చేస్తూ ఆయన లేఖను ముగించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వార్ జోన్ లో చిక్కుకున్న భారతీయుల లెక్క ఇదే
Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు
గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్
T20 World Cup 2026: టీ20 వరల్డ్కప్ విజేతలకు రూ.131 కోట్ల నజరానా