India vs Zimbabwe, 48th Match, Super 8 Group 1: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, జింబాబ్వే మధ్య టీ20 ప్రపంచ కప్లో 8వ సూపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు సాధించింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 33 పరుగుల వద్ద ఔటయ్యాడు. అభిషేక్ శర్మ 30 బంతుల్లో 55 పరుగులు, ఇషాన్ కిషన్ 38 పరుగులు, సంజు శాంసన్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.