India vs Pakistan: ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తొలిసారిగా తలపడనున్నాయి. గత రెండు మ్యాచ్లలో పాకిస్తాన్ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఇప్పుడు, సెప్టెంబర్ 28న దుబాయ్లో జరిగే మ్యాచ్లో భారత జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించి తన టైటిల్ను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టైటిల్ పోరుకు ముందు పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు. అయితే, పాక్ ఇద్దరు ఆటగాళ్లు హారిస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ నిషేధం ఎదుర్కోవలసి రావొచ్చు. దీనికి ప్రధాన కారణం బయటపడింది.
రవూఫ్, ఫర్హాన్ లపై ఎందుకు చర్య తీసుకోవచ్చంటే?
ఆసియా కప్ 2025లో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్, ఓపెనింగ్ బ్యాట్స్మన్ సాహిబ్జాదా ఫర్హాన్ వింత చర్యలతో టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసి మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది.
ఇవి కూడా చదవండి
ఈ కేసులో విచారణ సెప్టెంబర్ 26 శుక్రవారం జరుగుతుంది. ఇద్దరు ఆటగాళ్లు దోషులుగా తేలితే, వారిపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ ఆడకుండా కూడా వారిని నిషేధించే అవకాశం ఉంది.
అసలు విషయం ఏమిటి?
సెప్టెంబర్ 21న దుబాయ్లో జరిగిన ఈ టోర్నమెంట్ సూపర్ ఫోర్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ రెండోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో, పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత ఏకే 47 పేల్చుతూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విమానాలను నేల కూల్చినట్లు సంజ్ఞ చేశాడు.
బీసీసీఐ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కు ఫిర్యాదు చేసింది. ఈమెయిల్ తో పాటు హారిస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ ల వీడియోలను కూడా పంపారు. ఈ సందర్భంగా, పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే 47లా వేడుకను వివరించాడు.
సాహిబ్జాదా ఫర్హాన్ ఏం అన్నారు?
తన తుపాకీ వేడుక గురించి ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇది కేవలం వేడుక క్షణం మాత్రమే అని అన్నాడు. “నేను హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత పెద్దగా జరుపుకోను, కానీ అకస్మాత్తుగా ఈ రోజు జరుపుకోవాలని నాకు అనిపించింది. నేను అలాగే చేశాను. ప్రజలు దానిని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. నేను అది పట్టించుకోను” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంతలో, ఫర్హాన్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడని, తనకు ఎటువంటి విచారం లేదని ఇప్పటికే పేర్కొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. “మేం పూర్తి పత్రాన్ని సిద్ధం చేసి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు పంపాం.” PCB ఫిర్యాదు తర్వాత , సూర్యకుమార్ యాదవ్ విచారణ సెప్టెంబర్ 25న ICC ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ముందు జరిగింది. నివేదికల ప్రకారం, రిఫరీ సెప్టెంబర్ 26న తన తుది నిర్ణయాన్ని వెలువరించనున్నాడు. ఈ నిర్ణయం భారత కెప్టెన్కు వ్యతిరేకంగా జరిగితే , అతనికి హెచ్చరిక లేదా అతని మ్యాచ్ ఫీజులో ఒక శాతం జరిమానా విధించవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..