India vs England Result, T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ఉత్కంఠ విజయంతో ఫైనల్ చేరుకుంది. భారత్ అందించిన 254 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన ఇంగ్లాండ్ జట్టు.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇరుజట్ల మధ్య విజయం దోబుచులాడింది. చివరకు భారత జట్టు విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్లో భారత్ తన రెండవ అత్యధిక స్కోరు..
టీ20 ప్రపంచ కప్లో భారత్ తన రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఈ ప్రపంచ కప్లో జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమ్ ఇండియా సాధించిన 256 పరుగులే గతంలో అత్యధిక స్కోరుగా నిలిచింది.
ఈ మొత్తం టీ20 ప్రపంచ కప్లో నాల్గవ అత్యధిక స్కోరు. 2007లో కెన్యాపై 260 పరుగులు చేసిన శ్రీలంక టీ20 ప్రపంచ కప్లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును కలిగి ఉంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. సంజు శాంసన్ 89 పరుగులు చేయగా, శివమ్ దూబే 43 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 39, హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ తరపున విల్ జాక్స్, ఆదిల్ రషీద్ 2-2 వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇద్దరు బ్యాట్స్మెన్ రనౌట్ అయ్యారు.
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..