Hyderabad: నగర ప్రజలకు అలెర్ట్.. 24 గంటలపాటు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad: నగర ప్రజలకు అలెర్ట్.. 24 గంటలపాటు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం


హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లో క‌ల‌బ్ గూర్ నుంచి హైదర్ నగర్ వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్ప‌డ్డాయి. ఈ లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు తేది.24.09.2025, బుధవారం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మ‌రుస‌టి రోజు అన‌గా తేది.25.09.2025, గురువారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్ట‌నున్నారు.

కావున ఈ 24 గంట‌లు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో  ప్రెజ‌ర్‌తో నీటిస‌ర‌ఫ‌రా, మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుంది.

అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు:

  1.  ఓ అండ్ ఎం డివిజ‌న్ 17: ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్.
  2. ఓ అండ్ ఎం డివిజ‌న్ 22: బీరంగూడ‌, అమీన్ పూర్.
  3. ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2: ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు.
  4.  ఓ అండ్ ఎం డివిజ‌న్ 6: ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్.
  5.  ఓ అండ్ ఎం డివిజ‌న్ 9: కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్

కాబ‌ట్టి.. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని జల మండలి అధికారులు సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *