బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. మార్చి 3న హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ బంద్ అయ్యాయి. హోలీ సందర్భంగా ఆర్బీఐ బ్యాంకులకు సెలవుదినంగా ప్రకటించింది. హోలి, హోలిక దహన్, డోల్ జాత్ర, అట్టుకల్ పొంగళ సందర్భంగా బ్యాంకులకు సెలవు మంజూరు చేసింది. దీంతో దేశంలో బ్యాంకులు నేడు క్లోజ్ అయ్యాయి
మార్చిలో బ్యాంకులకు మొత్తం 18 రోజులు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. రెండు, నాల్గొ శనివారం, ఆదివారంతో పాటు ఈ నెలలో హోలీ, ఉగాది లాంటి పండుగలు వచ్చాయి. దీంతో బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. దీంతో ఖాతాదారులు ముందే సెలవుల గురించి తెలుసుుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి
హోలీ సందర్భంగా ఇవాళ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గోవా, బీహార్, జార్ఖండ్, కేరళ, ఏపీలో బ్యాంకులు మూతపడ్డాయి. మార్చి 4న హోలీ రెండో రోజు కూడా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. ఇక మార్చి 8న ఆదివారం బ్యాంకులు యథావిధిగా మూతపడతాయి.
బ్యాంకులు మూతపడ్డా ఆన్ లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. యూపీఐ, ఏటీఏం సేవలు కూడా వర్క్ చేస్తాయి. అయితే చెక్కులు, బ్రాంచ్ కార్యకలాపాలు అనేవి అందుబాటులో ఉండవు. దీంతో ఖాతాదారులకు బ్యాంక్ సెలవుల గురించి ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడాలి.
మార్చి 13న మిజోరంలో చాప్చార్ కుట్ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక మార్చి 19న ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మిజోరం, మహారాష్ట్రలో బ్యాంకులు క్లోజ్ చేయనన్నారు. ఇక మార్చి 20న రంజాన్ సందర్భంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.




