AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం

AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం (PPP) విధానంపై తీవ్ర చర్చ జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగిస్తూ, PPP విధానం పారదర్శకంగా ఉందని, టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతూ, తమ ప్రభుత్వం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోందని, PPP ద్వారా నిర్మాణం వేగంగా పూర్తవుతుందని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తక్కువ నిధులు కేటాయించారని కూడా ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kakinada: ఆ కంపెనీలకు లాక్లు వేయండి అంటూ మత్స్యకారుల ఆందోళన

Burning Topic: ఆలికి సింగారమే కాదు.. అమ్మకానికీ బంగారం

తిరుమలలో రూ.102 కోట్లతో వెంకటాద్రి నిలయం నిర్మాణం

ట్రిపుల్ ప్లే సేవలను ప్రారంభించిన BSNL తెలంగాణ

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *