Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్

Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్


Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్

కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలు కనకలక్ష్మి షూ వేసుకురాలేదన్న కారణంతో పలువురు విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేశారు. ఈ అమానుష చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్ తనను తాను సమర్థించుకుంటూ, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని, వారిని అవమానించే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. క్లాస్‌రూమ్‌లో పది నిమిషాల పాటు మాత్రమే చెప్పుల దండతో నిలబెట్టానని వివరణ ఇచ్చారు. ఈ చర్య కారణంగా విద్యార్థులు పూర్తి యూనిఫామ్‌తో, షూ ధరించి వచ్చారని, మార్పు వచ్చిందని టీచర్ తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, ఇలాంటి చర్యలు పిల్లలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *