Telangana: స్థానిక ఎన్నికల సమరానికి వేళాయే.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..

Telangana: స్థానిక ఎన్నికల సమరానికి వేళాయే.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..


తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదినీ సీఎస్ రామకృష్ణారావుతోపాటు ఉన్నతాధికారులతో కీలక భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.. అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్.. అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయని ఎస్ఈసీ తెలిపింది.. మొదటగా రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

– 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణ
– 5749 ఎంపీటీసీలు.. 565 జెడ్పీటీసీలు..
– మొత్తం గ్రామ పంచాయితీలు 12,733
– మొత్తం వార్డులు 1,12, 288

– రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
– మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
– అక్టోబర్‌ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
– అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
– నవంబర్‌ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *