ఇది కదా మ్యాచ్ అంటే..! ఇలాంటి ఆటనే కదా అభిమానులు కోరుకునేది..! 41 ఏళ్ల తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడిన టైటిల్ పోరు అసలైన క్రికెట్ మజాను అభిమానులకు అందించింది. చివరి బంతి వరకు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెడుతూ సాగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు.. జూలు విదిలించారు. ఊహించిన దానికంటే ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో తెలుగోడు తిలక్ వర్మ వీరోచిత పోరాటంతో పాకిస్థాన్ను మట్టికరిపించింది.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై అదిరే విజయం సాధించి భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దాయాది జట్టుపై టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఫైనల్లో పాక్ను భారత్ మట్టికరిపించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితమన్నారు. ‘‘మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’ కనిపించింది. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు’’ అంటూ పోస్ట్ చేశారు మోదీ.
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత ఆటగాళ్ళకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ గెలిచినందుకు టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్లో జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆటలో దాని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తులో టీమిండియా కీర్తిని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను’’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
My heartiest congratulations to Team India for winning the Asia Cup cricket tournament. The team did not lose any match in the tournament, marking its dominance in the game. I wish Team India sustained glory in the future.
— President of India (@rashtrapatibhvn) September 28, 2025
ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా టీమ్ ఇండియాకు అభినందనలు తెలుపుతు పోస్టులు పెట్టారు. ఈ అద్భుత విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో తెలంగాణ రాష్ట్రాని కి గొప్ప పేరు, గౌరవం తెచ్చారని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు.. అద్భుతమైన టీం వర్క్, డెడికేషన్, ఆత్మవిశ్వాసంతో పాకిస్తాన్ మీద విజయం సాధించి దేశం గర్వించేలా చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు.
Heartiest congratulations to Team India on their emphatic victory over Pakistan and for lifting the Asia Cup! Your determination, teamwork and spirit have made the nation proud. A glorious moment for Indian cricket! 🇮🇳#TeamIndia #AsiaCupFinal #indvspak2025 pic.twitter.com/8Y8LmjrG9q
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2025
ఈ గెలుపుతో భారత్ ఆసియా కప్ చరిత్రలో తొమ్మిదో టైటిల్ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా పాకిస్థాన్తో ఒకే టోర్నీలో మూడుసార్లు తలపడగా, మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించాయి. తిలక్ వర్మ ధైర్యవంతమైన ఇన్నింగ్స్, కుల్దీప్ స్పిన్ మాయా ఈ ఫైనల్ను ప్రత్యేకంగా మార్చాయి.