PM Modi: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌తో ప్రధాని మోదీ మర్యాదపూర్వక భేటీ

PM Modi: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌తో ప్రధాని మోదీ మర్యాదపూర్వక భేటీ


దేశ రాజకీయ పరిణామాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కలిశారు. ఇటీవలే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి… ఆయన నివాసం, వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్ వద్ద కలసి శుభాకాంక్షలు తెలిపారు.

ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం X ద్వారా వెల్లడించింది. “గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేడు గౌరవనీయ ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ గారిని వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు” అని పోస్ట్‌లో పేర్కొంది. ప్రధాని మోదీ కూడా ఈ భేటీ గురించి ట్వీట్ చేశారు.

ఈ భేటీలో దేశ రాజకీయ పరిస్థితులు, ముఖ్యమైన జాతీయ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా పార్లమెంట్‌లో శాసన కార్యక్రమాలు వేగంగా జరుగుతున్న తరుణంలో, ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

రాధాకృష్ణన్ ఇటీవలే ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, దేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన ఆయనకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలో ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *