దేశవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేవలం భారతదేశంలోనే కాదు.. పాకిస్థాన్లోనూ దసరా నవరాత్రుల వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. పాకిస్తాన్ లోని కరాచీలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తులు ధరించి, దాండియా నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటున్నారు. పాకిస్థాన్లోని హిందూ నివాసి ప్రీతమ్ దేవ్రియా ఈ వేడుకల వీడియోను పంచుకున్నారు. ముస్లింలు అధికంగా ఉన్న దేశంలో నవరాత్రి వేడుకలు జరుపుకోవడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..