తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండగ బతుకమ్మ. అందుకే ఏటా ఈ పండగను అట్టహాసంగా జరుపుకొంటారు తెలంగాణ వాసులు.సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం బతుకమ్మ వేడుకల్లో భాగమవుతారు. ఎంతో ఉత్సాహంగ ఆడిపాడుతారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నయి.ఢిల్లీలోని ఒక ప్రముఖ కాలేజీలో తెలుగు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.బతుకమ్మను నెత్తిన ఎత్తుకుని విద్యార్థులతో కలిసి సరదాగా పాటలు పాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీఎం రేఖా గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది కేవలం పూల ఉత్సవం మాత్రమే కాదు. మాతృత్వం, జీవనం, ప్రకృతి పట్ల గల గౌరవానికి ప్రతీక. తెలంగాణ మహిళలు తరతరాలుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం. ఢిల్లీలో ఉన్న తెలుగు విద్యార్థులు ఇలాంటి వేడుకలు నిర్వహించడం రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలపరుస్తుంది’ అని ట్వీట్ చేశారు రేఖా గుప్తా.
ఇవి కూడా చదవండి
ఇక ఉపాసన కొణిదెల రేఖా గుప్తా ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు. తెలంగాణ కల్చర్ను గౌరవిస్తూ తమతో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నందుకు ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది మెగా కోడలు. ప్రస్తుతం రేఖా గుప్తా, ఉపాసన బతుకమ్మ వేడుకలకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
ఢిల్లీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉపాసన కొణిదెల..
रामजस कॉलेज में तेलुगु छात्र संघ द्वारा आयोजित बथुकम्मा उत्सव में सम्मिलित हुई।
यह पर्व केवल फूलों का उत्सव नहीं, बल्कि मातृत्व, जीवन और प्रकृति की लय का प्रतीक है। इसमें सृष्टि की करुणा और जीवन की उमंग झलकती है।
दिल्ली में बसे तेलुगु समाज ने अपनी मेहनत और प्रतिभा से इस शहर को… pic.twitter.com/xxfduxCSEA
— Rekha Gupta (@gupta_rekha) September 27, 2025
ఉపాసన ట్వీట్..
Rekha Gupta ji you are an amazing CM. Thank you for embracing our Telangana culture and celebrating Bathukamma Panduga with us. Jai Hind. 🙏❤️ https://t.co/wY7xGYp9DS
— Upasana Konidela (@upasanakonidela) September 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.