ఇండియాకు పండగలాంటి ఓ విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. అండమాన్ దీవుల తూర్పు తీరం నుండి 9.2 నాటికల్ మైళ్ల (17 కి.మీ) దూరంలో 295 మీటర్ల నీటి లోతు, 2,650 మీటర్ల లక్ష్య లోతు వద్ద ఉన్న శ్రీ విజయపురం 2 బావిలో సహజ వాయువును కనుగొన్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. 2,212, 2,250 మీటర్ల మధ్య ప్రారంభ ఉత్పత్తి పరీక్షలో గ్యాస్ ఉనికిని నిర్ధారించారు. కాకినాడలో పరీక్షించిన నమూనాలలో 87 శాతం మీథేన్ ఉన్నట్లు తేలింది. గ్యాస్ పూల్, పరిమాణం, వాణిజ్య సాధ్యత రాబోయే నెలల్లో నిర్ణయిస్తారు.
అయితే ఈ ఆవిష్కరణ అండమాన్ బేసిన్ హైడ్రోకార్బన్ సామర్థ్యాన్ని నిర్ధారించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఇది మయన్మార్-ఇండోనేషియా బెల్ట్ వెంట కనుగొన్న వాటికి అనుగుణంగా ఉంటుంది. ఆఫ్షోర్ హైడ్రోకార్బన్ అన్వేషణను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డీప్ వాటర్ మిషన్తో ఈ ప్రకటన సరిపోతుంది. భారతదేశ ఇంధన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో పెట్రోబ్రాస్, బిపి, షెల్, ఎక్సాన్మొబిల్ వంటి ప్రపంచ అన్వేషణ భాగస్వాములతో సహకారం కీలకమని పూరి పేర్కొన్నారు.
An ocean of energy opportunities opens up in the Andaman Sea!
Very happy to report the occurrence of natural gas in Sri Vijayapuram 2 well at a distance of 9.20 NM (17 km) from the shoreline on the east coast of the Andaman Islands at a water depth of 295 meters and target depth… pic.twitter.com/4VDeGtt8bt— Hardeep Singh Puri (@HardeepSPuri) September 26, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి