దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్‌ పే బంపర్‌ ఆఫర్‌

దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్‌ పే బంపర్‌ ఆఫర్‌


ఈ క్రమంలో దీపావళి పండగ సీజన్ సమీపిస్తున్న వేళ, ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన, చవకైన బీమా పథకాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. బాణసంచా కాల్చడం ద్వారా జరిగే ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు, కేవలం రూ. 11 ప్రీమియంతో రూ. 25,000 విలువైన బీమా పాలసీని అందిస్తున్నట్లు ప్రకటించింది. పండగ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఈ పాలసీ కింద పాలసీదారుడు, వారి జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది. బాణసంచా ప్రమాదాల కారణంగా 24 గంటలకు పైగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా, డే-కేర్ చికిత్స తీసుకున్నా, ప్రమాదవశాత్తు మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. కుటుంబం మొత్తం ఒకే పాలసీ కింద రక్షణ పొందడం దీనిలోని ముఖ్యమైన అంశం. ఈ బీమా పాలసీ కొనుగోలు చేసిన నాటి నుంచి 11 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అక్టోబర్ 12వ తేదీ లేదా అంతకంటే ముందు పాలసీ తీసుకున్న వారికి ఆ రోజు నుంచే కవరేజీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాలసీ కొనుగోలు చేసిన వారికి, వారు కొన్న తేదీ నుంచి 11 రోజుల పాటు బీమా రక్షణ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. వినియోగదారులు నిమిషంలోపే ఫోన్‌పే యాప్ ద్వారా ఈ పాలసీని చాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు. యాప్‌లోని ‘ఇన్సూరెన్స్’ విభాగానికి వెళ్లి, ‘ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ పాలసీ వివరాలు, ప్రయోజనాలను చూసి, వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, రూ. 11 చెల్లించడం ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!

రెహమాన్‌ పాట శివస్తుతి కాపీనా ?? కోర్టు ఏం చెప్పిందంటే

గంగమ్మ ఎండిపోతోందా? ఎందుకిలా!

Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం

తన చేతికొచ్చిన మూవీని గోపీచంద్‌కు ఇచ్చేసిన ప్రభాస్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *