తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఫైనల్ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరసింహా రెడ్డి మాట్లాడుతూ, తమ విద్యార్థులు డెప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ వంటి ఉన్నత స్థానాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తామని, హాస్టల్, మెస్, లైబ్రరీ సౌకర్యాలు 24/7 అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. హైదరాబాద్లోని ఉత్తమ ఫ్యాకల్టీతో పాటు అవసరమైనప్పుడు ఢిల్లీ నుంచి కూడా నిపుణులను ఆహ్వానిస్తామని తెలిపారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే ఎక్కువగా ఇక్కడ శిక్షణ పొందుతున్నారని, తెలుగు మీడియంలో చదివిన వారు సైతం గ్రూప్-1 స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని ఆయన అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lokesh Kanagaraj: కూలీతో అడ్డంగా బుక్ అయిపోయిన లోకేష్.. అందరికి టార్గెట్ అతడే
Kantara: ఎవరూ ఊహించని వివాదం లో కాంతార.. దానికి కారణం ఇదే
రికార్డ్ స్థాయిలో OG రిలీజ్.. వేచి చూస్తున్న కొత్త రికార్డులు
నీరుకొండపై 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
ఫస్ట్ టైమ్ రైలు పై నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం