నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది మహోదక రూపం దాల్చింది. భారీ వర్షాల కారణంగా గోదావరి వరదలు ఉద్ధృతంగా ఉన్నాయి. బాసరలోని పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీరు ఆలయాలను, పురవీధులను ముంచెత్తుతోంది. గోదావరి పుష్కర ఘాట్కు వెళ్లే రహదారి జలదిగ్బంధంలో ఉంది. అధికారులు భక్తులు గోదావరిలోకి ప్రవేశించకుండా పడవలను అడ్డుకుంటున్నారు. సావర్గావ్, కౌటా, ఓని, సాలాపూర్ వంటి గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం
రేపటి నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
కొవ్వూరులో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత
పాక్ క్రికెటర్ల తీరుపై ICCకి BCCI ఫిర్యాదు
లడఖ్ లో అదుపులోకి వచ్చిన ఆందోళనలు