నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది.ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే వారు బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ ఇష్టపడతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో బంగారం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే లక్ష మార్క్ దాటినే గోల్డ్ రేట్స్ రెండు లక్షలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఎదురు అవుతున్నాయి.
ఇక గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు గురువారం స్వల్పంగా తగ్గాయి. కాగా, ఈరోజు మనం బంగారం ఎలా ఉన్నాయో చూద్దాం.బులియన్ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 25) 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1,15,360 గా ఉంది.(రూ.10 తగ్గింది), 22 క్యారెట్ల బంగారం తులం రూ.1,05,740 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం తులం రూ.86,520 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సెప్టెంబర్ 24, 2025 శుక్రవారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,370గా ఉండగా,నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,15,360గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,05,750గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,05,740గా ఉంది.
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,360 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,05,740 లుగా ఉంది. ఇక వెండి కొనుగోలు చేసే వారికి మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పాలి. నేడు సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి పై రూ.100 తగ్గడంతో కేజీ వెండి రూ.1,49,900గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,360 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,05,740లుగా ఉంది. కిలో వెండి ధర రూ.124,900 లుగా ఉంది.వరంగల్ జిల్లాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,360. 22 క్యారెట్ల ధర రూ.1,05,740లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,49,900లుగా ఉంది.