తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ నెలకొంది.. మరికొన్ని గంటల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం ఓజీ.. థియేటర్లలో సందడి చేయనుంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనుండగా.. గురువారం నుంచి పూర్తి స్థాయిలో థియేటర్లలో ఓజీ చిత్రం సందడి చేయనుంది.. ఈ క్రమంలోనే.. ఓజీ చిత్రానికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓజీ టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే విధించింది. బెనిఫిట్షో టికెట్ ధరలు కూడా పెంచొద్దన్న హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో ఓజీ మూవీకి పెంచిన టికెట్ల రేట్లు తగ్గే అవకాశం ఉంది.
కాగా.. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు స్టార్స్ నటించారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు.. అలాగే డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత నటించిన గ్యాంగ్ స్టర్ మూవీ ఓజీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.