తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని అబ్బిడిపల్లి అనే చిన్న గ్రామం ఇటీవల నేత్రదానం విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు 700 మంది జనాభా ఉన్న ఈ గ్రామం, 100% నేత్రదానం చేయడానికి తీర్మానం చేసుకోవడం ద్వారా ఒక అద్భుతమైన రికార్డును సృష్టించింది. అందరూ వ్యవసాయం మీద ఆధారపడిన శ్రామికులు అయినప్పటికీ, వారిలో అక్షరాస్యత శాతం అంతంత మాత్రమే అయినప్పటికీ, నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ గ్రామంలో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మొదట కొంత మంది మాత్రమే ముందుకు రాగా, తరువాత గ్రామ సభ ఏర్పాటు చేసి, ప్రజలందరికీ అవగాహన కల్పించారు.
మరిన్ని వీడియోల కోసం :