
ఉత్తర ఒడిస్సా, గ్యాంగ్టెక్ వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. సముద్రమట్టం నుంచి 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిస్సా, దక్షిణ ఛత్తీస్గడ్, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్నాటకల మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సాగటు సముద్రమట్టం నుండి 5.8లో ద్రోణి ఏర్పడింది. ఎల్లుండి తూర్పు, మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిస్సా ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈనెల 26వ తారీఖు నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తారీఖు నాటికి తీరాన్ని దాటుతుంది.
ఈ రోజు తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో మోస్తారు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో తేలికపాటి ఉరుములతో మోస్తారు నుండి భారీ వర్షం కురుస్తాయి. రాగల నాలుగు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయంది.